హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): మిల్లర్లు వారికి ఇష్టమొచ్చినప్పుడు ఇష్టమొచ్చినంత బియ్యం ఇవ్వడానికి సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ ఏమీ డంపింగ్ యార్డు కాదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. ఎఫ్సీఐకి బియ్యం ఎగ్గొట్టి నాసిరకం బియ్యాన్ని సివిల్సైప్లెకి కట్టబెడతామంటే కుదరదని స్పష్టంచేశారు. ఎఫ్సీఐకి బియ్యం ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి 25% పెనాల్టీ వసూలు చేస్తామని హెచ్చరించారు.
సీఎమ్మార్, రేషన్బియ్యం నాణ్యత, గన్నీ సంచుల సేకరణ తదితర అంశాలపై గురువారం ఆయన ఎంసీఆర్హెచ్చార్డీలో అడిషినల్ కలెక్టర్లు, డీసీఎస్వోలు, డీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. గత ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సీఎమ్మార్ను ఈ నెల 31లోగా ఎఫ్సీఐకి అందజేయాలని ఆదేశించారు. మిల్లర్ల నుంచి సీఎమ్మార్ కింద రావాల్సిన ప్రతి బియ్యపు గింజను వసూలు చేయాలని అడిషనల్ కలెక్టర్లకు సూచించారు.