హైదరాబాద్, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం 250 మంది మైనారిటీ విద్యార్థులను ‘సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి ఎంపిక చేసినట్టు మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్ ఉమర్ జలీల్ తెలిపారు. ఫాల్ సీజన్కు సంబంధించి వీరిని ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఎంపికైన వారిలో 143 మంది విద్యార్థులు, 107 మంది విద్యార్థినులు ఉన్నారని వివరించారు. జాబితాను http://www.telanganaepass.cgg.gov.inలో ఉంచినట్టు పేర్కొన్నారు.