హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : స్పౌజ్ పాయింట్లను రద్దు చేసి, ఈ వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ (టీఎన్ఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనను కలిసి వినతిపత్రం అందజేసింది.
జీవో 317 ద్వారా పది జిల్లాల టీచర్లను 33 జిల్లాలకు సర్దుబాటు చేసిన నేపథ్యంలో చిన్న జిల్లాల్లోనూ బదిలీల కోసం స్పౌజ్ పాయింట్లు కేటాయించడం సరికాదని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోకల శేఖర్, ప్రధాన కార్యదర్శి ఎం సక్కుబాయి తెలిపారు.