కందుకూరు : దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రమాద బీమాను ప్రవేశపెట్టినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ బీమా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కొండంత అండగా ఉంటుందని పేర్కొన్నారు. మండల పరిధిలోని దావుద్గూడ గిరిజన తండాకు చెందిన సత్యవత్ రాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన పార్టీ సభ్యత్వంతో పాటు ప్రమాద బీమా చేశారు. దీంతో పార్టీ తరపున ఆయనకు రూ. 2లక్షలు మంజూరు కాగా మంగళవారం మృతుడి భార్యకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏ పని అయిన ముందుచూపుతో చేపడుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరికీ ప్రమాద బీమా చేస్తున్నట్లు వివరించారు. దీంతో టీఆర్ఎస్లో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.
బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని సూచించారు. ప్రభుత్వ పరంగా కూడా వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. బీమా సౌకర్యం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, నాయకులు కల్లెం సదానంద్గౌడ్, సంతోష్నాయక్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.