దళితసాధికారత కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. హుజూరాబాద్ నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లు, వాసాలమర్రి గ్రామానికి రూ.7.60 కోట్లు ఇప్పటికే విడుదల అయ్యాయి. వీటితోపాటు ఖమ్మం, సూర్యాపేట, నాగర్కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. కల్యాణలక్ష్మి, బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందిస్తూ ఎస్సీ సంక్షేమంలో దేశానికే మార్గదర్శనం చేస్తున్నది. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమ రంగంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం గడిచిన 7 ఏండ్లలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను నోట్ రూపంలో సభ్యులకు అందజేశారు.