నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ ఉదయ సముద్రంలో భారీ చేపలు లభ్యమయ్యాయి. నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామానికి చెందిన జాలరి రుద్రాక్షి శ్రీను తోటి జాలర్లతో కలిసి అదివారం వలలు వేయగా.. 20 కిలోల బొచ్చ చేపతోపాటు 18, 15, 10 కేజీల చేపలు చిక్కాయి. వాటిని పక్కనే రోడ్డుపై పెట్టి అమ్మగా రూ.15 వేలు వచ్చాయని శ్రీను సంబురపడ్డాడు.
-నల్లగొండ రూరల్