హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి హెచ్ఎండీఏ నుంచి ఇవ్వాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీపై సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. వేములవాడలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. వేములవాడ చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలో మరో సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు.