హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీగా పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రూ.2 వేల కోట్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించార ని, ఈ దిశగా వేగంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. బుధవారం సచివాల యంలో ఎస్పీఈజెడ్ అధికారులు, జపాన్ సటాకే కార్పొరేషన్ ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి మూడు కోట్ల టన్నులకు పెరిగిందని, ఆశించిన స్థాయిలో మిల్లింగ్ కెపాసిటీ పెరుగలేదని తెలిపారు.
2014లో 1,815 రైస్ మిల్లులు ఉండగా ప్రస్తుతం 2,574కి మాత్రమే పెరిగినట్టు చెప్పారు. రైస్బ్రాన్ ఆయిల్, నూక ప్రాసెసింగ్కు వీలుగా మిల్లులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మలోల ఇన్నోవేషన్స్, సీఎస్ఎం, ఐబీఐ, ప్లానెట్ ఎం తదితర సంస్థల ప్రతినిధులతోనూ చర్చించారు. సమావేశంలో టీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్కుమార్ గవార్, ప్రతినిధి సుష్మ, జపాన్ సటాకే కార్పొరేషన్ ప్రతినిధులు ఆరే బజాజ్ తదితరులు పాల్గొన్నారు.