హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ): ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాంక్లేవ్ -22లో ‘డిగ్నిటీ హౌసింగ్’ పేరిట తెలంగాణ ప్రదర్శిస్తున్న డబుల్ బెడ్రూం సముదాయాల మాడల్ ప్రశంసలు అందుకుంటున్నది. గుజరాత్లోని రాజ్ కోట్లో జరుగుతున్న ఈ హౌసింగ్ ఎగ్జిబిషన్లో జీహెచ్ఎంసీ కొల్లూరు ఫేజ్-2, రాంపల్లిలో చేపట్టిన 2బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ మాడల్ను అకడ ప్రదర్శించింది.
రాష్ట్రప్రభుత్వ ప్రోద్బలంతో లక్ష 2బీహెచ్కే ఫ్లాట్లతో అన్ని సదుపాయాలతో డిగ్నిటీ హౌసింగ్ కాలనీలు నిర్మిస్తున్నామని జీహెచ్ఎంసీ హౌసింగ్ విభాగం అధికారులు తెలిపారు. కొల్లూరు రెండవ దశ ద్వారా రూ.1,354 .59 కోట్ల వ్యయంతో 15,660 గృహాలు.. 117 బ్లాక్లలో చేపట్టారు. రాంపూర్లో రూ.539.76 కోట్ల వ్యయంతో 52 బ్లాక్లలో 6,240 డబుల్ బెడ్రూం నిర్మాణాలను చేపట్టినట్లు హౌసింగ్ విభాగం అధికారులు పేర్కొన్నారు.