హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్) దరఖాస్తులు జోరందుకున్నాయి. వారం వ్యవధిలోనే మరింత పుంజుకున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలకు ముందు ఎప్సెట్ దరఖాస్తులు లక్షలోపే ఉండేవి. ఇంటర్ పరీక్షలు ముగియడంతో దరఖాస్తుల సంఖ్య అమాం తం పెరిగింది. ఈ నెల 18 వర కు 1.49 లక్షల దరఖాస్తులు రాగా, బుధవారం వరకు 2.63 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి. ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులంతా ఇప్పుడు ఎప్సెట్పై దృష్టిపెట్టారు. నిరుడు ఎప్సెట్కు రికార్డుస్థాయిలో 3,20,766 దరఖాస్తులొచ్చాయి. వీటిలో తెలంగాణ నుంచి 2.48 లక్షలు, ఏపీ నుంచి 77 వేల దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసే అవకాశం ఉన్నది.
ఏపీలో సెంటర్ల కొరత..
ఎప్సెట్ పరీక్ష నిర్వహణకు ఏపీలో సెంటర్ల కొరత సమస్య తలెత్తింది. గుంటూరు, విజయవాడ, వైజాగ్లలో ఎప్సెట్ పరీక్షాకేంద్రాలను ఆయా నగరాల మధ్యలోని కాలేజీల్లోనే నిర్వహిస్తున్నారు. ఆ కాలేజీల్లోనే ఎన్నికల స్ట్రాంగ్రూమ్స్ ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షాకేంద్రాల స్థానంలో కొత్తవాటిని వెతికే పనిలో అధికారులున్నారు.
అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం
ఎప్సెట్కు పరీక్షాకేంద్రాలు సహా ఎలాంటి ఇబ్బందుల్లేవు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రభావంతో అక్కడక్కడ గతంలో ఉన్న సెంటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇవి తప్ప మరే సమస్యల్లేవు. విద్యార్థులకు ఆందోళన అక్కర్లేదు. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షలను సజావుగా నిర్వహిస్తాం.
– ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి,ఎప్సెట్ కోకన్వీనర్.
దరఖాస్తుల నమోదు ఇలా..
తేదీ దరఖాస్తులు
26-02-24 – 3,113
28-02-24 – 15,355
04-03-24 – 39,920
05-03-24 – 44,938
18-03-24 – 1,49,183
26-03-24 – 2,54,252
27-03-24 – 2,63,225