హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్కు చెం దిన అజిత్ సాయినాథ్కు సైబర్ నేరగాళ్లు భారీ షాక్ ఇచ్చారు. ఆయన ల్యాప్టాప్లోకి చొరబడి రూ.2.2 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగిలించారు. బాధితుడు శుక్రవారం సీసీఎస్ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు మొదలైంది. వృత్తిరీత్యా పెయింటింగ్ ఆర్టిస్ట్ అయిన సాయినాథ్.. కొన్నాళ్ల నుంచి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నిర్వహిస్తున్నాడు. బిట్కాయిన్ విలువ రూ.40 వేలు ఉన్న సమయంలో తనవద్ద ఉన్న 20 బిట్కాయిన్లను అమ్మేసి వివిధ రకాలైన క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేశాడు. వాటి అడ్రస్లను తన ల్యాప్టాప్లో భద్రపరిచాడు. ఆ వ్యాలె ట్ల పాస్వర్డ్లను గూగుల్ డాక్యుమెంట్స్లో దాచి ఉంటాడని, సాయినాథ్ గూగుల్ అకౌంట్ను హ్యాక్చేసిన సైబర్ నేరగాళ్లు అతని పాస్వర్డ్లను తెలుసుకొని క్రిప్టోకరెన్సీని చోరీచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.