వనపర్తి : సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలో మదనాపురం పోలీస్ స్టేషన్ను ప్రారంభించి మాట్లాడారు. మహబూబ్నగర్ ఎంపీగా కేసీఆర్ ఉన్నప్పుడు నాడు మదనాపురం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం వచ్చిన తరువాత నూతన మండలంగా మదనాపురాన్ని ఏర్పాటు చేశారన్నారు. వంద సంవత్సరాల అవుట్ పోస్టును పోలీస్ స్టేషన్గా మార్చడం ఆనందంగా ఉందన్నారు. గతంలో మదనాపురాన్ని రెండో బొంబాయిగా పిలిచేవారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు మార్కెట్లు మాత్రమే ఉండేవి. ఒకటి బాదేపల్లి, రెండు మదనాపురం మర్కెట్ యార్డు అన్నారు. అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఉన్న మదనాపురం నుంచి ఇతర ప్రాంతాలకు సరుకు రవాణా అయ్యేదని తెలిపారు. కార్యక్రమలో ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వ రావు ఉన్నారు.