హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : జాతీయ 31వ బాలల సైన్స్ కాంగ్రెస్కు రాష్ట్రం నుంచి 14 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. మంగళవారం అమీర్పేటలోని సెస్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 14 ప్రాజెక్ట్లను జాతీయస్థాయికి ఎంపికచేశారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీఎస్కాస్ట్) ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. కార్యక్రమంలో టీఎస్కాస్ట్ సభ్యకార్యదర్శి మారుపాక నగేశ్, విద్యాశాఖ జేడీ మదన్మోహన్, సెస్ డైరెక్టర్ రేవతి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎంపికైన విద్యార్థులు
ప్రాజెక్టులు రూపొందించిన 14 మంది విద్యార్థులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరిలో టీ డార్విన్ బాలాజీ (ఖమ్మం), శివరాం బెనర్జీ(హైదరాబాద్), సీ సాయిక్రిష్ (కామారెడ్డి), భుక్యా సలోని (యాదాద్రి భువనగిరి), కే మహిధర్ (సూర్యాపేట), ఎం కీర్తి కౌశిక్( హనుమకొండ), ఎస్ అశ్వంత్ (సిద్దిపేట), సీహెచ్ బ్రాహ్మణి (వరంగల్), జే శివమణి (నాగర్కర్నూల్), జీవన్ నాన్జీష్ (మహబూబ్నగర్), పీ వినీల (రాజన్న సిరిసిల్ల), ఇన్నేశ్ చీకటిమార్ల (రంగారెడ్డి), ఎం సుమిత్ (నిర్మల్), కే రుగ్వేద్ (కరీంనగర్)లు ఎంపికయ్యారు.