జమ్మికుంట, ఏప్రిల్ 12: తెల్లబంగారం మెరుస్తున్నది. మద్దతుకు మించి రెట్టింపు ధర నమోదవుతూ రైతులకు సిరులు కురిపిస్తున్నది. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డుస్థాయిలో క్వింటాల్కు రూ.12,300 పలికింది. మోడల్ ధర రూ.11,850, కనిష్ఠ ధర రూ.9 వేలతో వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడు అంచనాకు మించి ధర లభిస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.