హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ధూప, దీప నైవేద్యం పథకానికి నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ కోరింది. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఆయనను ప్రజాభవన్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అర్చక ఉద్యోగులకు జీవో 577 ప్రకారం 5,625 మందికి ఇవ్వాల్సి ఉండగా 3 వేల మందికి మాత్రమే రాష్ట్ర ఖజానా నుంచి వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. దేవాదాయశాఖ ఇచ్చిన 121 జీవోను రద్దు చేయాలని కోరా రు. అన్యాక్రాంతమైన ఆలయాల భూములను స్వాధీనం చేసుకొని వాటిని వేలం ద్వారా విక్రయిస్తే గణనీయమైన ఆదాయం సమకూరుతుందని తెలిపారు. కార్యక్రమం లో కొండగట్టు, వేములవాడ, కాళేశ్వరం, బాసర, భద్రాచలం, యాదాద్రి అర్చకులు, ఉద్యోగులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి కురాకుల, ప్రధా న కార్యదర్శి అన్నపూర్ణ, ఉద్యోగులు జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ఉద్యోగుల సంక్షే మ సంఘం అధ్యక్షుడు శివకుమార్, దేవాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కొండూరి కృష్ణమాచారి, అధ్యక్షుడు భద్రినారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.