హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రజకులు, నాయీబ్రాహ్మణులకు కల్పిస్తున్న ఉచిత విద్యుత్తు పథకానికి ప్రభుత్వం రూ.12.88 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. నిధుల విడుదల పట్ల సీఎం కేసీఆర్కు రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్యసలహాదారు, ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బీసీ సంక్షేమశాఖ పరిధిలోని ఔట్సోర్సింగ్ సేవల నిర్వహణ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.33.51లక్షలకు అదనంగా మరో రూ.50లక్షల నిధులను ప్రభుత్వం రిలీజ్ చేసింది.