హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్తో పాటు పంజాబ్లో కనివినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వర్షాలకు ఓవైపు కొండచరియలు విరిగిపడుతుంటే..మరోవైపు భీకరమైన వరద ఉధృతికి ఇండ్లు నేలమట్టం కాగా, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఊహించని రీతిలో వచ్చిన వరదకు చాలా మంది నిరాశ్రయులయ్యారు.
కానీ ఇదే సందర్భంలో ఒక యువ సెయిలర్ ప్రాణాలకు తెగించి దాదాపు 150మందికి పైగా ప్రాణాలు కాపాడి హీరో అనిపించుకున్నాడు. ఇటీవలే చైనాలో అంతర్జాతీయ కనోయి ఫెడరేషన్(ఐసీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ కప్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన జుగ్రాజ్సింగ్ కాంస్య పతంతో మెరిశాడు. అయితే పంజాబ్లో వరదలకు అతాలకుతలమైన బసంత్నగర్లో జుగ్రాజ్ తన సెయిలింగ్ బృందంతో కలిసి స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించాడు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) బృందాల కంటే ముందుగానే చేరుకున్న జుగ్రాజ్సింగ్ బృందం రోపర్ సిటీ దగ్గరలోని బసంత్నగర్లో తొలుత 70మందిని వేరే చోటుకు తరలించింది. అద్లాపూర్ గ్రామానికి చెందిన జుగ్రాజ్ ప్రసుత్తతం కత్లీలో పంజాబ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సెయిలింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడు.
మొత్తం పది సహాయక బృందంలో ఇద్దరు హాకీ ప్లేయర్లు కూడా ఉన్నారు. దీనికి కనోయిగ్, కయాకింగ్ కోచ్ జగ్జీవన్సింగ్ సారథ్యం వహించాడు. కోచ్ అప్పజెప్పిన పనిని మరో మాటకు తావులేకుండా ఆచరించిన జుగ్రాజ్సింగ్ విలువైన ప్రజల ప్రాణాలు కాపాడి అందరి మన్ననలు పొందాడు. వీరి సాహాసాన్ని జిల్లా క్రీడాధికారి రూపేశ్కుమార్ ప్రత్యేకంగా ప్రశంసించారు.