హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్టార్టప్ల పురోగతి అత్యంత వేగంగా సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహంతో స్టార్టప్ ఎకోసిస్టం (అనుకూల వాతావరణం) విలువ రూ.11,500 కోట్లకు చేరింది. స్టార్టప్ల వృద్ది జాతీయ సగటుతో పోలిస్తే రెండురెట్లు అధికంగా నమోదైంది. కరోనా విపత్కర కాలంలోనూ 18శాతం వృద్ధిని సాధించింది. ఈ విషయాలను గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ (జీఎస్ఈఆర్)-2021 వెల్లడించింది. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని రిపోర్ట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. టీహబ్ ఏర్పాటు, స్టార్టప్లు కల్పించే ప్రతి ఉద్యోగానికి రూ.10వేలు సాయం అందించడం, మూడేండ్లపాటు ఏటా 15 శాతం వృద్ధి సాధిస్తే టర్నోవర్లో 5 శాతం గ్రాంట్గా ఇవ్వడం, 5 వేల స్టార్టప్లను ప్రోత్సహించాలని తెలంగాణ సోషల్ స్టార్టప్ నెట్వర్క్ లక్ష్యంగా నిర్దేశించుకోవడం వంటి చర్యలను ప్రశంసించింది. కృత్రిమ మేధస్సు రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునేలా 30వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రంలో ఫార్మా రంగాన్ని సైతం రిపోర్ట్ ప్రశంసించింది. లైఫ్సైన్సెస్ ఎకోసిస్టమ్ను రాబోయే పదేండ్లలో రూ.7.4 లక్షల కోట్లకు చేర్చాలన్న లక్ష్యాన్ని, మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటును ప్రస్తావించింది. ఓ జాతీయ వార్తా పత్రికలో ప్రచురితమైన ఆ రిపోర్ట్లోని అంశాలను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ట్వీట్ చేశారు. ఆ రిపోర్ట్లోని కొన్ని
ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..