హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగా ణ): తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ) జూనియర్ కాలేజీల్లో గిరి జన విద్యార్థులకు 1,140 సీట్లు అందుబాటు లో ఉంచినట్టు సొసైటీ కార్యదర్శి నవీన్ నికోల స్ తెలిపారు. బాలికలకు 575, బాలురకు 565 సీట్లు ఉన్నట్టు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ)లో ప్రవేశా లకు ఫిబ్రవరి 5లోపు https://tsswreisjc. cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసు కోవాలని సూచించారు.
ఈ ఏడాది మార్చిలో పదోతరగతి పరీక్షకు రాసే గిరిజన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు అని స్పష్టం చేశారు. రాత పరీక్ష ఫిబ్రవరి 18న ఉంటుంద ని, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొ న్నారు. నిరుపేద విద్యార్థు లకు ఐఐటీ, నీట్ తదితర జాతీయస్థాయి పరీక్షల్లో లాంగ్టర్మ్ కోచింగ్ ఇచ్చేందుకు 14 ఎస్సీ, ఎస్టీ గురుకు లాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.