పాల్వంచ, ఏప్రిల్ 1: భద్రాద్రి జిల్లా పాల్వంచ పరిధిలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) విద్యుత్తు ఉత్పత్తితోపాటు వనరుల ఆదాలో రికార్డులు సృష్టిస్తున్న ది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటీపీఎస్ 10వ యూనిట్ శనివారం అర్ధరాత్రి నాటికి 83.53 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (ఫీఎల్ఎఫ్) సాధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్లాంట్ల పరిధిలో రెండో స్థానాన్ని పొందింది. 11వ యూనిట్ 83.10 శాతం పీఎల్ఎఫ్ సాధించి మూడో స్థానంలో నిలిచింది. 5, 6 దశలు (మూడు యూనిట్లు) 82.10 శాతం పీఎల్ఎఫ్తో 7191.6 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి సాధించి మొదటి స్థానం పొందాయి. 7వ దశ పరిధిలోని 12వ యూని ట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో పరిధిలో నిర్మించిన ఏకైక యూనిట్. ఈ యూనిట్ గతేడాది 2021-22లో 83.56 పీఎల్ఎఫ్ సాధిస్తే.. ఈ ఏడాది కేవలం 60.09 పీఎల్ఎఫ్ సాధించింది. ఈ యూనిట్లో అనేకసార్లు సాంకేతిక కారణాలతో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్తు బ్యాక్డౌన్ కారణంగా 27.43 శాతం ఉత్పత్తినీ తగ్గించుకున్నది. ఫలితంగా విద్యుత్తు ఉత్పత్తిలో వెనుకబడింది.
కేటీపీఎస్ 9వ యూనిట్ రికార్డు
కేటీపీఎస్ 5వ దశలోని 9వ యూనిట్ ఈ ఆర్థిక సంవత్సరంలో నిరంతరాయంగా విద్యు త్తు ఉత్పత్తి చేసింది. ఇదే యూనిట్పై గతంలో 144 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసిన రికార్డు ఉంది. 10వ యూనిట్పైనా గతం లో 222 రోజుల రికార్డు ఉంది. శనివారం అర్ధరాత్రి ఆ రికార్డును తిరగరాసి 223 రోజుల రికార్డు సృష్టించింది. అలాగే కేటీపీఎస్ 5, 6వ దశల పరిధిలో గతేడాది కన్నా ఈ ఏడాది 848.618 కిలోలీటర్ల ఆయిల్ ఆదా అయిం ది. యూనిట్లలో ఆగ్జిలరీ పవర్ కంజెప్షన్ తగ్గించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 5.03 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయింది. కార్మికులు, ఇంజినీర్లు, ఆర్టిజన్ల కృషితోనే ఈ రికార్డులు సాధ్యమయ్యాయని కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ప్రభాకర్రావు తెలిపారు.