హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): మైనారిటీ సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.106.31 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మైనారిటీ వర్గానికి చెందిన ఉద్యోగార్థులకు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన మైనారిటీ స్టడీ సర్కిళ్లకు, వక్ఫ్ బోర్డ్, హజ్ కమిటీ నిర్వహణకు రూ.17.75 కోట్లు విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే పేద, మధ్యతరగతి మైనారిటీ యువతీయువకులకు ఆర్థిక చేయూతనందించేందుకు ఏర్పాటు చేసిన సీఎం ఓవర్సీస్ విద్యానిధి పథకానికి రూ.88,56,46000 విడుదల చేసింది.