హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 240 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ బారినపడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,858 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,84,023కు చేరాయి. ఇందులో 6,75,132 మంది బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 98.70శాతంగా ఉండగా, మరణాల రేటు 0.58శాతంగా ఉంది.
ఇవాళ 42,991 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. తాజాగా రాష్ట్రంలో మరో 10 కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఐదుగురికి, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఐదుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 94కు పెరిగింది. ఇప్పటి వరకు 37 మంది బాధితులు కోలుకున్నారు.