హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): మెడ్టెక్, మొబిలిటీ స్టార్టప్లకు రూ.10 లక్షల సీడ్ ఫండ్ అందజేయనున్నట్టు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ-సీఐఈ ఇంక్యుబేటర్ నిర్వాహకులు వెల్లడించారు. సరికొత్త ఆలోచనలతో వైద్య, రవాణా రంగాల స్టార్టప్లను ప్రారంభించినవారికి అండగా నిలిచేందుకు జీరో 2 వన్ ల్యాబ్తో కలిసి నిధులు సమకూర్చే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఔత్సాహిక స్టార్టప్ నిర్వాహకులు https://cie.iiit.ac.in/zero2one-labs/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.