KCR KIT | రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రులకు గర్భిణులు క్యూ కడుతున్నారు. అంతే కాకుండా నార్మల్ డెలివరీలకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సర్కార్ దవాఖానాల వైపే గర్భిణులు మొగ్గు చూపుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తప్ప సీజేరియన్లు చేయడం లేదు.
అయితే వేములవాడ ఏరియా ఆస్పత్రిలో ఒకే రోజు 10 కాన్పులు చేసి వైద్యులు రికార్డు సృష్టించారు. 10 కాన్పుల్లో నాలుగు సీజేరియన్లు కాగా, ఆరు నార్మల్ డెలివరీలు చేసినట్లు వైద్యాధికారి మహేశ్ రావు వెల్లడించారు. తల్లులు, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిందరికి కేసీఆర్ కిట్లు అందజేసినట్లు తెలిపారు.