హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల స్వరూపం మారనున్నది. ప్రత్యేకించి పుస్తకాల్లోని పాఠ్యాంశాలకు ప్రాధాన్యత తగ్గనున్నది. వీలైనంత మేరకు పుస్తకాల నాలెడ్జ్ను తగ్గించి.. ఇండస్ట్రీ ఆశించిన నైపుణ్యాలు జోడించేందుకు ఉన్నత విద్యామండలి కృషిచేస్తున్నది. కోర్ అంశాలకు కేవలం 50-60% వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రవేశపెట్టే కోర్సుల్లో పాఠ్యాంశాలకు ఇచ్చే వెయిటేజీ తగ్గించనున్నారు. ఇంటర్న్షిప్ తప్పని చేశారు. రీసెర్చ్/ ఇంటర్న్షిప్నకు 10-15% క్రెడిట్లు ఉంటాయి. మూడేండ్ల డిగ్రీ కోర్సులో 120 క్రెడిట్లు ఉంటాయి. రాష్ట్రమంతా ఒకే క్రెడిట్ పాలసీ అమలయ్యేలా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. భవిష్యత్తు ఉద్యోగ ధోరణులకు అనుగుణంగా, సాంకేతిక నైపుణ్య ఆధారిత విద్యనించేందుకు మండలి కొత్తకోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నది.