ఓదెల, జూన్ 15: తమ ఊరి బడిలో 42 ఏండ్లు సేవలందించిన ఓ పార్ట్టైం స్వీపర్కు గ్రామస్థులు వినూత్నరీతిలో వీడ్కోలు పలికారు. స్వీపర్ దంపతులను ఘనంగా సన్మానించి, రూ.1.50 లక్షలను బహూకరించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గోపరపల్లి ప్రాథమిక పాఠశాలలో మహ్మద్ షఫియుల్లాబేగ్ పార్ట్టైం స్వీపర్గా 42 ఏండ్లు పనిచేశాడు.
వయస్సు పైబడటంతో గత ఏప్రిల్లో ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేయించింది. ప్రభుత్వం తరఫున అతడికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. దీంతో స్పందించిన గ్రామస్థులు, ఉపాధ్యాయులు విరాళాలు సేకరించారు. బుధవారం పాఠశాల ఆవరణలో షఫియుల్లాబేగ్ దంపతులను సన్మానించి, 1.50 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నగునూరి కుమారస్వామి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, సర్పంచ్ కర్క మల్లారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.