హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): హనుమకొండ జిల్లా కేంద్రంలోని శాయంపేట క్రాస్రోడ్డు వద్ద నిర్మిస్తున్న మడివేలు మాచీదేవుడు కల్చరల్ ఎడ్యుకేషన్ సోషల్ కాంప్లెక్స్ (కేసీఆర్ భవన్)కు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రెండోదఫాగా రూ.1.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం 2018లో రూ.1.95 కోట్లు మంజూరు చేయగా, మొదటి అంతస్తు వరకు పనులు పూర్తయ్యాయి. పైఅంతస్తు కోసం అదనంగా రూ.1.30 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రతిపాదనలను అందజేశారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం నిధులు చేసింది. దీనిపై రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్, ఎంబీసీ రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యానారాయణ హర్షం ప్రకటించారు. సీఎం కేసీఆర్కు, నిధుల కోసం కృషిచేసిన సారయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.