హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సోలార్ పవర్ ప్రాజెక్టులు పెడుతున్నామంటూ నమ్మించి స్నేహితులు, తెలిసిన వారి వద్ద నుంచి రూ.12 కోట్లు మోసం చేసిన ఘరానా చీటర్ను సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కరీంనగర్కు చెందిన మహ్మద్ అల్తాఫ్ అహ్మద్ 2018లో సౌదీ అరేబియాలోని బ్యాంకులో పనిచేశాడు. ఆ సమయంలో తనతో పనిచేసే ఖాజా మహబూబ్ అలీఖాన్తోపాటు మరికొందరితో పరిచయా లు పెంచుకొన్నాడు. అల్తాఫ్ సౌదీ నుంచి తిరిగివచ్చాడు. తన స్నేహితులిద్దరిని కలుపుకొని సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పేరుతో భారీ ఎత్తున వసూలు చేయాలని ప్లాన్ చేశాడు. అల్తాఫ్ తన స్నేహితుడిలో ఒకరిని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఆడీఏ) తెలంగాణ స్టేట్ సోలార్ పవ ర్ ప్రాజెక్టు నోడల్ అధికారిగా, మరొకరిని ఇస్రోలో సైంటిస్ట్గా సృష్టించాడు. తాను దుబాయ్లో పనిచేస్తున్న సమయంలో హైదరాబాద్కు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని, సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో భారీ లాభాలున్నాయని, 25 శాతం పెట్టుబడి పెడితే 75 శాతం కేంద్రం భరిస్తుందంటూ నమ్మించాడు. తెలంగాణలో ఆమనగల్, మంచిర్యాలతోపాటు మరిన్ని ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులకు అనుమతి ఉందంటూ ఒక్కో ప్రాజెక్టుకు రూ.7.4 కోట్లు ఖర్చవుతుందంటూ నమ్మించాడు. దుబాయ్కి చెందిన ఖాజా మహబూబ్ అలీ ఖాన్ వద్ద రూ. 2.18 కోట్లు, హైదరాబాద్కు చెం దిన మరికొందరి వద్ద మిగతా డబ్బు మొత్తం రూ.12 కోట్లు వసూలు చేశాడు. సోలార్ పవర్ తయారయ్యా క తెలంగాణ విద్యుత్తుశాఖ కొంటుందని తెలిపేలా టీఎస్ఎస్పీడీసీఎల్ ఛీప్ ఇంజినీర్ పేరుతో నకిలీ కొనుగోలు అగ్రిమెంట్ను, ఈమెయిల్ ఐడీలు, ఇతర డా క్యుమెంట్లు తయారుచేసి బాధితులను నమ్మించి మో సానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అల్తాఫ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.