బంజారాహిల్స్, మే 27: ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలం టూ బీఆర్ఎస్ నాయకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్యాదవ్, తంగబాలు తదితర నాయకులు బుధవారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చి సీఎం రేవంత్రెడ్డి తదితరులపై ఫిర్యాదు చేశారు. ‘ప్రగతిభవన్ను నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేస్తే ఏంది.. అనాడు గడీలు పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతిభవన్ను డైనమైట్లు పెట్టి పేల్చినా మాకు నష్టం లేదు.
మాకు సంబంధం లేదు’ అం టూ గతంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన హింసను ప్రేరేపించేలా ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఉద్దేశిస్తూ కూడా అనేక సందర్భాల్లో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. దీంతోపాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సైతం అరవిందో ఫార్మా ఫ్యాక్టరీని తగులబెడ్తానంటూ మీడియా ముఖంగా హెచ్చరికలు చేశారని, రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ గతంలో ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకు తాం..అంటూ వ్యాఖ్యానించారని తెలిపారు. ఇలాంటి నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.