హాలియా, ఏప్రిల్ 25 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎనిమిదేండ్ల కాలంలో ఎవ్వరికీ సాధ్యం కాని విజయాలను సాధించిన ఘనత ఆయనకే దక్కిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలోని లక్ష్మీ నర్సింహగార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లీనరీలో ఆయన రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, దలితబంధు, కేసీఆర్ కిట్, మిషన్ భగరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గత పాలకులు 50 ఏండ్లలో సాధించలేని విజయాలను సీఎం కేసీఆర్ కేవలం ఎనిమిదేండ్లలో సాధించారన్నారు.
వరి సాగులో మనం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడంతో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి వాటిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. దాంతో పాటు అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను ఓర్వలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్షసాధింపుతో వ్యవహరిస్తూ నిధుల విడుదలలో జాప్యం చేస్తుందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల అధికారాలను దుర్వినియోగం చేస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు దేశంలోనూ బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. అనంతరం 11 అంశాలపై ప్లీనరీలో తీర్మానాలు ప్రవేశ పెట్టగా సభికులు ఏక గ్రీంగా ఆమోదించారు.
కార్యక్రమంలో ఎంపీపీలు బొల్లం జయమ్మ, మంచుకంటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, జయరాంనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశం, మర్ల చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంపటిపార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, పెద్దవూర పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, నరేందర్, తాటి సత్యపాల్, రమానాయక్, పిడిగం నాగయ్య, గజ్జల చెన్నారెడ్డి, బాబూరావునాయక్, కామర్ల జానయ్య, రాంచంద్రయ్య, యడవల్లి మహేందర్రెడ్డి, మాద ధనలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తలు పాల్గొన్నారు.