సంగారెడ్డి, జూలై 27 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్.. వైసిగ్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (WiSig) 5జీ పేటెంట్లకు లైసెన్స్లు జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నదని ఐఐటీ ప్రొఫెసర్, వైసిగ్ నెట్వర్క్స్ వ్యవస్థాపకులు కిరణ్ కూచి పేర్కొన్నారు. ప్రస్తుతం వైసిగ్ 5జీ, 6జీ సేవలపై పరిశోధనలు చేస్తున్నదని, 5జీ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడంలో వైసిగ్ నెట్వర్క్ విశేష కృషి చేసిందని తెలిపారు.
5జీ టెక్నాలజీకి సంబంధించి వైసిగ్ నెట్వర్క్స్ 160కి పైగా పేటెంట్లు, 24 ప్రామాణికమైన ఎసెన్షియల్ పేటెంట్లను సాధించిందని చెప్పారు. వైసిగ్ నెట్వర్క్స్ కంపెనీ తన పేటెంట్లపై నాన్-డిస్క్రిమినేటరీ(FRAND) ప్రాతిపదికన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5జీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు లైసెన్స్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు కిరణ్ కూచి వివరించారు. కేంద్ర ప్రభుత్వం 6జీ విజన్ సాకారం కోసం వైసిగ్ కృషి చేస్తున్నట్టు తెలిపారు.