హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామ సర్వే నం బర్ 46లోని 84.34 ఎకరాలు తమవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ భూములపై కొందరు భూ మా ఫియా వ్యక్తులు తప్పుడు పత్రాలతో గత ఏప్రిల్లో హైకోర్టు నుంచి పొందిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.
భూ ములు ప్రభుత్వానివేనని హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన తర్వాత థర్డ్ పార్టీ వ్యక్తులు రీకాల్ పిటిషన్ వేసి ఉత్తర్వులు పొందారని, ఆ ఉత్తర్వులను రీకాల్ చేయాలని రాష్ట్ర సర్కారు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ గండికోట శ్రీదేవి, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినితో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపి స్తూ.. థర్డ్ పార్టీ వ్యక్తులు రివ్యూ పిటిషన్లో సమర్పించిన పత్రాలు బోగస్ అనడానికి ఆధారాలు ఉన్నాయని నివేదించా రు. ధర్మాసనం విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.