హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలకు చెప్పుకోవడానికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు అన్నారు. భజరంగ్ దళ్ను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి శోభా కర్లాందాజే హనుమాన్ చాలీసా చదువుతున్న వీడియోపై శుక్రవారం కేటీఆర్ స్పందించారు. అవినీతికి పాల్పడిన బీజేపీని కర్ణాటక ప్రజలు అధికారం నుంచి సాగనంపడం ఖాయమన్నారు.