కోస్గి, మార్చి 27 : నారాయణపేట జిల్లా గుండుమాల్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోగారం గ్రామానికి చెందిన రైతు మల్లేశ్ తన పొలం రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ పాండునాయక్ను కలువగా రూ.3 వేలు లంచం డిమాండ్ చేశాడు. వెంటనే అతడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పథకం ప్రకారం బుధవారం మల్లేశ్ తహసీల్దార్ పాండునాయక్కు కార్యాలయంలోనే డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని, కేసు నమోదు చేశారు.