హైదరాబాద్, ఆగస్ట్ 7(నమస్తే తెలంగాణ): ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వీ-హబ్ నూతన కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ రంగంలోని స్టార్టప్స్కి మద్దతుగా నిలిచేందుకు క్యూ-మార్ట్తో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని క్యూ-మార్ట్లో ఏర్పాటు చేసిన వీ-కార్నర్ని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, క్యూ-మార్ట్ డైరెక్టర్ రాహుల్ వర్మ, వీ హబ్ సీఈవో దీప్తి రావుల ప్రారంభించారు. ఒప్పందంలో భాగంగా ఎఫ్ఎంసీజీ స్టార్టప్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించేలా అన్ని క్యూ-మార్ట్స్లో ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది.
హింద్ కాపర్ ఆశాజనకం
న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ కాపర్ నికరలాభం జూన్ త్రైమాసికంలో 54 శాతం వృద్ధిచెంది రూ.29.69 కోట్ల నుంచి రూ.45.63 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం మాత్రం రూ. 441 కోట్ల నుంచి రూ.278 కోట్లకు తగ్గింది.