Covid 19 | తెలంగాణలో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ఇవాళ కొత్తగా 2295 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్తో తాజాగా ముగ్గురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీలోనే అత్యధికంగా 1452 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసులు భారీగా పెరిగినప్పటికీ.. రాష్ట్రంలో రికవరీ రేటు 97.98 శాతంగా ఉంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 64,474 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా నుంచి తాజాగా మరో 278 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 9861 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.