హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani )తనదైన రీతిలో దూసుకెళ్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ తిరుగుతూ స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి, చేయబోయే పనులను వివిరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మంగళవారం పద్మారావు నగర్లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం భారీ బైక్ ర్యాలీ(Bike rally)ని ప్రారంభించారు. ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీఆర్ఎస్ జెండాలతో సనత్నగర్ గులాబీమయమైంది.