పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచి మూల మంగ ఆదివారం భూమి పూజ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు మంజూరు చేసింది.
ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో పారిశుధ్య అభివృద్ధి పనులను సోమవారం గ్రామ సర్పంచ్ మూల మంగ మల్లేశం గౌడ్ ప్రారంభించారు. గ్రామంలోని రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కలను బ్లేడ్ ట్రాక్టర్ తో చదును చేయించారు