ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని దొడ్డిదారిన ఎక్స్అఫీషియో ఓట్లను నమోదు చేయించుకొని ఉద్యమ ఖిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది.
ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ ధర్మబద్ధంగా చేసే పాలనను ప్రజా పాలన అంటారు. కానీ నేడు ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధర్మ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నది.