దక్షిణ డిస్కంలో జరుగుతున్న బదిలీల వ్యవహారాన్ని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి 21 యూనియన్లతో కూడిన రెండు జేఏసీలు పోరుబాట పట్టాయి. సుమారు ఆరువేల మంది ఉద్యోగులు ఆందోళనకు దిగడానికి సిద్ధమయ్యారు. �
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులిచ్చాకే.. బదిలీలు చేపట్టాలని విద్యు త్తు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి.