1956కు ముందు సొంతరాష్ట్రంగా, సొంత ఆదాయం, మిగులు బడ్జెట్తో విలసిల్లిన తెలంగాణ.. ఇప్పుడు నిరంతర పోరాటం చేసి సంకెళ్లు తెంచుకొని మరోసారి తన కాళ్ల మీద తాను నిలబడటానికి ప్రయత్నాలు చేస్తున్నది.
ఆంధ రాష్ట్రంలో తెలంగాణను కలిపిన తర్వాత సుమారు పన్నెండేండ్ల పాటు సాగిన అన్యాయాలు, అక్రమాలు, అణచివేతలు, నిధుల దోపిడీల గురించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టికి తెలంగాణవాదులు తీసుకువెళ్లారు.