వలిగొండ, ఫిబ్రవరి 14 : మండలంలోని పులిగిల్ల గ్రామంలో రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం లింగ ప్రతిష్ఠాపన, ఆంజనేయస్వామి, రేణుకా ఎల్లమ్మ దేవాలయాల్లో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల శివనామ స్మరణ నడుమ రుత్వికులు అంగరంగ వైభవంగా జరిపించారు. క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అభివృద్ధికి జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని చైర్మన్ కోమటిరెడ్డి అనంతరెడ్డికి అందజేశారు. సర్పంచ్ జక్క వెంకట్రెడ్డి, ఎంపీటీసీ బండారు ఎల్లయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నాగెల్లి కృష్ణమూర్తి, వాకిటి రాంరెడ్డి, కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి, వడ్డెమాను మధుసూదన్, పైళ్ల మల్లారెడ్డి, కొలను రాంరెడ్డి, నక్కల సత్తిరెడ్డి, మన్నెం శ్రీనివాస్రెడ్డి, కళ్లెం సుదర్శన్రెడ్డి, కొలను లక్ష్మీమహేందర్రెడ్డి పాల్గొన్నారు.