సూర్యాపేట అర్బన్, జూన్ 28 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లా వ్యాప్తంగా సెకండియర్ విద్యార్థులు 56 శాతం, ఫస్టియర్ విద్యార్థులు 51 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. బాలికలు సెకండియర్లో 66 శాతం, ఫస్టియర్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించగా అదే బాలుర విభాగంలో ద్వితీయ సంవత్సరం 46 శాతం, ప్రథమ సంవత్సరంలో 41 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ చదువుతున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు 8,690 మంది పరీక్షలకు హాజరుకాగా 4,335 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో మొత్తం 8,639 మంది విద్యార్థులకు గాను 4,798 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్త ఫలితాల్లో సూర్యాపేట జిల్లా 32వ స్థానంలో ఉంది.
ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలతో పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సర ఫలితాలలో కళాశాలకు చెందిన కొమ్ము ప్రశాంతి బైపీసీ విభాగంలో 429/440 మార్కులు, గుగులోతు ప్రియాంక 426/440, ఎంపీసీ విభాగంలో కర్నాటి కృతి 435/470, సెకండియర్ ఎంపీసీ విభాగంలో ఈగ సిరిమోహన 951/1000, బైపీసీలో వడిదల పూజిత 924/1000 మార్కులు సాధించినట్లు తెలిపారు.
బీసీ గురుకుల విద్యార్థులు..
అనంతగిరి పాఠశాలలో ఎంపీసీలో బి. నిహారిక 465/470, బైపీసీలో ఎం.పావని 436/440, ఎంఎల్టీలో బి.శ్రీవాణి 489/500, సీఈసీలో ఎస్. మాధుర్య 473/500 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా సమన్వయ అధికారి అన్నపూర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నాలుగు బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు 86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.
అనంతారం మోడల్ స్కూల్లో..
తిరుమలగిరి : ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో అనంతారం మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బెజగం నవ్యశ్రీ బైపీసీ 928/1000, గిలకత్తుల భవాని ఎంపీసీ 877/1000, గొడిశెల అనూష ఎంఈసీ 864/1000 మార్కులు సాధించారు. అలాగే ఫస్టియర్ ఫలితాల్లో షబానా అఫ్స ఎంపీసీ 451/470, కోల పూజ బైపీసీ 396/440, ఊడుగు ప్రవళిక సీఈసీ 417/500, సీహెచ్ మానస ఎంఈసీ 385/500 మార్కులు సాధించారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ వేముల బాలరాజు, ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయిలో మెరిసిన ఆదర్శ విద్యార్థిని
సూర్యాపేట రూరల్ : మండలంలోని ఇమాంపేట గ్రామ ఆదర్శ పాఠశాల విద్యార్థిని అంజలి ఫస్టియర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించింది. బైపీసీలో 430 /440 మార్కులు సాధించింది. విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ బి.శంకర్నాయక్, ఉపాధ్యాయలు సన్మానించారు.
నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల..
నేరేడుచర్ల : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ద్వితీయ సంవత్సరం ఏసీపీ(ఒకేషనల్ కోర్సులో) బి.జాహ్నవి 921/1000, పి.పుష్ప 879/1000, హెచ్ఈసీలో సుప్రజ 762/1000, ప్రథమ సంవత్సరం బైపీసీలో 380/440 మార్కులు సాధించగా వీరిని కళాశాల ఉపాధ్యాయులు అభినందించారు.
గరిడేపల్లి ఆదర్శ, కేజీబీవీ విద్యార్థులు..
గరిడేపల్లి : మండల కేంద్రంలోని కేజీబీవీ, గడ్డిపల్లి గ్రామంలో గల ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఫలితాల్లో సత్తా చాటారు. కేజీబీవీ ఫస్టియర్ ఎంపీసీలో కొత్తపల్లి అనూష 460/470, గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో ఎంపీసీ ఫస్టియర్లో బుడిగె శిల్ప 470/446, బైపీసీ సెకండియర్లో జోత్స్న 946/1000 సాధించారు.
హుజూర్నగర మైనార్టీ కళాశాల విద్యార్థులు
హుజూర్నగర్ : హుజూర్నగర్ మెనార్టీ కళాశాల విద్యార్థులు ఫలితాల్లో సత్తా చాటారు. ఎంఈసీ విద్యార్థిని పీవీ ఉషశ్రీ 472, సీఈసీ విద్యార్థిని సిరాజున్నిస 453 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ రెహానా అభినందించారు.
కోదాడ కేఆర్ఆర్ జూనియర్ కాలేజీ..
కోదాడటౌన్ : పట్టణానికి చెందిన కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఫస్టియర్ ఎంపీసీలో తులసి 450, లౌక్య 449, వినయ్ 429, నవ్య 422 మార్కులు సాధించారు. అలాగే సెకండియర్లో సాయితేజ 962, సాయిప్రియ 940, లహరి 921, శ్రీకాంత్ 670 మార్కులు సాధించారు.
తుంగతుర్తి గురుకుల విద్యార్థుల విజయదుందుబి..
తుంగతుర్తి : తుంగతుర్తి గిరిజన బాలికల, బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు ఫలితాల్లో విజయదుందుబి మోగించారు. ఫస్టియర్లో 60 శాతం, సెకండియర్లో 86 శాతం మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ దుర్గాభవాని తెలిపారు. బాలుర గురుకుల కళాశాలలో ఫస్టియర్లో రిత్విక్రెడ్డి 463/470, సెకండియర్లో నారంశెట్టి వినిత్కుమార్ 943/1000 మార్కులు సాధించినట్లు చెప్పారు. సాంఘిక సంక్షేమ గురుకులంలో మొదటి సంవత్సరంలో 79 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81.7శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్యామలత తెలిపారు. మైనార్టీ గురుకులంలో ఫస్టియర్లో 80 శాతం ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్ ఉమారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో 32 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.4 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి తెలిపారు.
పసునూరు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
నాగారం, జూన్ 28 : ఫలితాల్లో మండలంలోని పసునూరు మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో వర్దెల్లి దిశారాణి 955, బైపీసీలో శిగ గౌతమి 922, సీఈసీలో టి.మిథిల్కుమార్ 812, ఎంఈసీలో శ్రీరమ్య 835, ఎంపీసీ ఫస్టియర్లో వర్దెల్లి త్రిష 454, బైపీసీలో కె.సంధ్యారాణి 428, సీఈసీలో ఎం.సౌజన్య 421 మార్కులు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.రమేశ్ తెలిపారు.
ప్రతిభ కనబరిచిన ప్రతిభ విద్యార్థులు..
ప్రతిభ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి టి.పార్థసాయి 467 మార్కులు సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలువగా బైపీసీలో జంగం శ్రీకర్ 436 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచాడు. సుమారు 30 మంది విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించగా 118 మంది విద్యార్థులు 400 లకు పైగా మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో నిస్సార్ జవేరియా 988, డి.ఉదయ్కుమార్ 984, ఎం.శ్రీవైష్ణవి 980, వి.సాయికుమార్ 980 సాధించగా బైపీసీలో సీహెచ్.అన్మిషా 990 మార్కులతో జిల్లా ఫస్ట్లో నిలువగా సుమారు 65 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కె.వెంకట్రెడ్డి, డైరెక్టర్ కె.సత్యంబాబు అభినందించారు.
సత్తా చాటిన సాయిగౌతమి విద్యార్థులు..
సాయిగౌతమి కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో పి.శ్రీలక్ష్మి 467 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకుంది. జె.వర్షిణి 465, డి.ఉష 464, పి.హేమలత 464, పి.అభినవ్ 462, కె.వైష్ణవి 462, అవినాశ్ 460, కె.శ్రావణి 460, బైపీసీలో కె.కీర్తి 427, జి.మేఘన, జి.సందీప్, ఎం.అక్షర 424 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో జి.అజిత 980, ఉదయ్ 974 మార్కులు సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందనలు తెలిపింది.
భవిత విద్యార్థుల విజయకేతనం..
ఫలితాల్లో భవిత విద్యాసంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జూనియర్ ఎంపీసీలో బి.సిరిచందన 465, ఎన్.సాయిశర్వాణి 464, జె.భవాని 464, జూనియర్ బైపీసీలో బి.రోహిణి 434, జె.మౌనిక 429, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎ.ప్రసన్న 981, బైపీసీలో షేక్ సన 976 మార్కులు సాధించగా 400ల పైగా మార్కులు 70 మంది, 900కు పైగా మార్కులు 60 మంది సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ మారం వెంకట్రెడ్డి తెలిపారు.
శ్రీనిధికి అత్యుత్తమ మార్కులు..
శ్రీనిధి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాదించారు. ఫస్టియర్ ఎంపీసీలో టి.వైష్ణవి, ఆర్.మనోజ్ఞ, ఎన్.రాజశ్రీ 464, బైపీసీలో వై.సౌక్య గౌడ్ 433, నఫిహా నరీన్ 431, సీనియర్ ఎంపీసీలో అయేష ఫిర్దోస్ 986, బైపీసీలో శాంతిసుమ 982 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ జి.యాదవరెడ్డి, ప్రిన్సిపల్ ఎం.శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్ పి.పరశురాం, వై.మల్లారెడ్డి అభినందించారు.
ఒకేషనల్ విద్యార్థుల ప్రతిభ..
బొడ్రాయిబజార్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటసాయి ఒకేషనల్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించారు. ఫిజియోథెరపీ ఫస్టియర్లో కె.మాధవి-493, డెయిరీలో బి.నిఖిత-493, ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్)లో బయ్య మానస-482, కంప్యూటర్ సైన్స్లో యశ్వంత్-480, ఎలక్ట్రికల్లో ఓర్సు గణేశ్-479, ఎంఎల్టీలో డి.జయశ్రీ-469, సెకండియర్ ఎలక్ట్రికల్లో బి.లాలు-955, డెయిరీలో కె.విఘ్నేశ్-932, ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్)లో ఎ.శ్రీవాణి-905, ఎంఎల్టీలో ఎం.పావని-906, కంప్యూటర్స్లో ఎస్.సంపత్ 874 మార్కులు సాధించారు. విద్యార్థులను, సహకరించిన అధ్యాపకులను కళాశాల కరస్పాండెంట్ కారింగుల బాలాగౌడ్, చైర్మన్ విజయలక్ష్మి అభినందించారు.