రామగిరి/బొడ్రాయిబజార్, జనవరి 11 : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో కూడారై వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని రామగిరి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారు, రంగనాథస్వామికి ఉదయం అభిషేకాలు చేశారు. అనంతరం 108 గిన్నెలతో చక్కెర పొంగలిని స్వామివారికి నివేదించారు. అలాగే వీటీ కాలనీ శ్రీదేవిభూదేవి సహిత వేంకటేశ్వరాలయం, పాతబస్తీ సంతోషిమాత ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవస్థానాల్లో సుమారు వెయ్యి మందికి ప్రత్యేకంగా తయారు చేసిన పాయస ప్రసాదాన్ని స్వామివారికి నివేదించారు. మహిళలు మంగళహారతులు పట్టి స్వామివారిని కొలువగా.. విష్ణు సహస్రనామ పారాయణం, గోదాదేవి పాశురాలను అర్చకులు వివరించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, కౌన్సి లర్ యామా కవితాదయాకర్, శ్రీరంగం దేవస్థానానికి చెందిన శ్రీమాన్ పరశార లక్ష్మీనృసింహభట్టాగర్ స్వామి, అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, మురళీధరాచార్యులు, సముద్రాల యాదగిరాచార్యులు, శఠగోపాచార్యులు, రఘుచార్యులు, చకిలం వేణుగోపాల్రావు, రాజేశ్వర్శర్మ, పిల్లిరామరాజుయాదవ్, మొరిశెట్టి శ్రీనివాస్సుధారాణి, వై.శ్రీనివాస్రెడ్డి, ఆండాళ్ గోష్టి వికాస తరంగిణి భక్త బృందం పాల్గొన్నారు.