Inter Question Papers | సూర్యాపేట అర్బన్ : ఈ నెల 5 నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు రెండు సెట్లు, ఏ, బి శనివారం డిస్టిక్ బల్క్ కేంద్రం నుంచి సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. ఈ ప్రశ్నాపత్రాలను కస్టోడియన్లు బాల్తు శ్రీనివాస్, మేడ నిరంజన్ రెడ్డి, కర్నాటి శ్రీనివాసులు స్వాధీనం చేసుకొని ఆయా 13 సెంటర్లకు సంబంధించిన సీఎస్, డీవోల సమక్షంలో స్ట్రాంగ్ రూంలో తేదీల వాదీగా భద్రపరిచారు.
ప్రశ్న పత్రాలను భద్రపరచుట క్రమాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి బాబు నాయక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాబు నాయక్ మాట్లాడుతూ.. చాలా జాగ్రత్తగా ప్రశ్నాపత్రాలని భద్రపరచాలని… క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలని తెలిపారు. ఆయా సెంటర్లకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సరిపడా వచ్చాయా..? లేదా అనేది ధ్రువీకరించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సురేఖ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య, డాక్టర్ మద్దిమడుగు సైదులు తదితరులు పాల్గొన్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు