సూర్యాపేట : సూర్యాపేట జిల్లా పాలక వీడు మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ ని రైతులు ముట్టడించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఇష్టానుసారం కరెంటు కోతలను ఖండిస్తూ సబ్ స్టేషన్ ముందు నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయానికి నిత్యం కరెంటు కోతలతో అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కండ్లముందే పంటలు ఎండిపోతున్న ఏమీ చేయలని పరిస్థితితుల్లో నిస్సాహయంగా ఉన్నామన్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని వాపోయారు. ఇప్పటికైనా సరిపడా కరెంట్ ఇవ్వాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.