నాగారం: అపత్కాలంలో అపద్భాందవుడిలా సీఎం కేసీఆర్ అన్ని వేళల్లో నిరుపేదలకు అండగా ఉంటున్నారని తుంగతు ర్తి శాసనసభ్యుడు గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుదవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నాగారం మండలం లోని పలు గ్రామాలకు చెందిన 15మంది లబ్ధిదారులకు రూ. 5,68,000ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొంది ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అంది స్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, తిరుమలగిరి మార్కెట్ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్యగౌడ్, పానుగంటి నర్సిం హా రెడ్డి, పొదిల రమేశ్, దోమల బాలమల్లు, ఎంపీటీసీ వడ్డె పరశురా ములు, అరుణ్, చిల్లర చంద్రమౌళి, ఈదుల కిరణ్కుమార్, ఆంజనేయులు, లింగమల్లు, యల్ల య్య, గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.