శాలిగౌరారం నవంబర్ 23 : తెలంగాణ రాష్ట్రంలోని వేల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందని కట్టంగూర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ ఉప్పల రవీందర్ కుమార్ అన్నారు. ఆదివారం శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని పలువురు ప్రముఖులు పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1000 సూర్యదేవాలయం చోళ, కాకతీయ, శాతవాహనుల, విష్ణు కుండుల సమ్మేళనంగా నిలిచిందన్నారు. సూర్య దేవాలయం పునర్ నిర్మించాలని, ధూపదీప నైవేద్యాలను కొనసాగించాలని కోరారు. పురావస్తు, దేవాదాయ శాఖల సమన్వయంతో ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో యూఎన్ఓ కౌన్సిల్ మెంబర్ ఆదోని వెంకటరమణ, సీనియర్ జర్నలిస్ట్ సురేష్, ప్రొఫెసర్ శ్రీకాంత్, మంగారెడ్డి, రమేష్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.