Stars Side Business | దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు పెద్దలు. ఈ మాట పెడచెవిన పెట్టిన పాతతరం నటులు రెండు చేతులా సంపాదించినా కూడా కష్టార్జితాన్ని నిలబెట్టుకోలేక పోయారు. చివరి రోజుల్లో సాయం కోసం చేతులు చాచాల్సిన పరిస్థితి వచ్చింది. నవతరం నటులు మాత్రం ఆ పొరపాటు చేయడం లేదు. పక్కా ప్రణాళికతో అడుగులేస్తున్నారు. కొత్త కొత్త రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆంత్రప్రెన్యూర్స్గా పేరు తెచ్చుకుంటున్నారు.
నటి శ్రియ ‘శ్రీస్పందన’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ‘శ్రీ స్పా’ను నిర్వహిస్తున్నది. ఇక్కడ పనిచేసే వారంతా అంధులే. చేయితిరిగిన మర్దన నిపుణులకు దీటుగా మసాజ్ థెరపీలు చేస్తారు. దివ్యాంగులకు ఎంతోకొంత ఆర్థిక సాయం చేయడంకంటే, తమ కాళ్ల మీద తాము నిలబడేలా తీర్చిదిద్దడమే ఉత్తమమని అనుకున్నారు శ్రియ. స్పా నిర్వహణ బాధ్యతలను శ్రియ తల్లి నీరజా శరణ్ తీసుకున్నారు.
చిన్నప్పటి నుంచీ ఫంక్షన్లు, పెండ్లి వేడుకలంటే ఇష్టపడే తాప్సీ పన్ను అదే రంగాన్ని సమాంతర కెరీర్గా ఎంచుకున్నది. ఈ మధ్యనే వెడ్డింగ్ మేనేజ్మెంట్లోకి
అడుగుపెట్టింది. చెల్లెలు షాగన్, స్నేహితురాలు పరాహ్ పర్వరేశ్తో కలిసి ‘వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ని స్థాపించి వివాహాల ప్లానర్గా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న కంపెనీలు పెట్టి పది మందికో, వంద మందికో ఉపాధి కల్పించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిని సమంత నేతృత్వంలోని
‘సస్టెయిన్ కార్’్ట ప్రోత్సహిస్తున్నది. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ స్టార్టప్లో ఇప్పటికే చాలా రాష్ర్టాలకు చెందిన వందలాది హస్త కళాకారులు, సేంద్రియ రైతులు భాగస్వాములు. సస్టెయిన్ కార్ట్లో ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలు, ఆభరణాలు, దుస్తులు, సబ్బులు, షాంపూలు, గృహోపకరణాలు, గృహాలంకారాలు, ఆయుర్వేద ఉత్పత్తులు ఉంటాయి. ఈ కంపెనీలో సమంతకు 30 శాతం వాటా ఉంది. శిల్పారెడ్డి, కాంతి దత్ ఇతర భాగస్వాములు. ఫ్యాషన్ డిజైనర్, మాజీ మిసెస్ ఇండియా శిల్పా రెడ్డితో కలిసి ‘ఏకం’ అనే స్కూల్ కూడా ప్రారంభించింది సమంత.
‘వైట్ అండ్ గోల్డ్’ పేరుతో మిల్కీ బ్యూటీ తమన్నా సొంత జువెలరీ బ్రాండ్ను ఏర్పాటు చేసుకుంది. ఆభరణాలకు తనే డిజైనర్. ఆన్లైన్ సేల్స్ ద్వారా వైట్ అండ్ గోల్డ్ డిజైనర్ ఆభరణాలను విక్రయిస్తున్నది. ముంబయితో పాటు మరికొన్ని నగరాల్లో స్టోర్స్ కూడా ప్రారంభించింది.
‘క్లౌడ్ కిచెన్’తో లాభాలను అందిపుచ్చుకోవాలన్నది అక్కినేని నాగ చైతన్య వ్యూహం. ఫ్రెండ్తో కలిసి ‘షోయూ’ క్లౌడ్ కిచెన్ను స్టార్ట్ చేశాడు. వేడివేడి అల్పాహారం నుంచి మిడ్ నైట్ బిర్యానీ వరకు అన్నీ సిద్ధం చేస్తుందీ క్లౌడ్ కిచెన్. షోయూలో ఆసియా దేశాల్లోని అన్ని రకాల వంటకాలూ
దొరుకుతాయి.
అందమే ఆనందం అన్నారు. ఇతరులకేమో గానీ, సినిమా తారలు మాత్రం ఆనందాలు నిలుపుకోవాలంటే అందాన్ని కాపాడుకోవాల్సిందే. అందం, ఆరోగ్యంతోనే కెరీర్ ముడిపడి ఉంటుంది. అందుకనే తారలు ఫిట్నెస్ పట్ల శ్రద్ధ చూపుతారు. రోజూ కొన్ని గంటల సమయాన్ని కసరత్తుకు కేటాయిస్తూనే.. దీన్నీ ఓ కెరీర్గా మలుచుకున్నది రకుల్ ప్రీత్ సింగ్. సోదరుడు అమన్తో కలిసి గచ్చిబౌలిలో ‘ఎఫ్45’ జిమ్ ఫ్రాంచైజీని ప్రారంభించింది. విశాఖపట్నం, బెంగళూరుకు కూడా విస్తరించింది.
విమానయాన రంగంలో ఆకాశాన్నంటే అవకాశాలను గుర్తించాడు రామ్చరణ్. కాబట్టే ‘ట్రూ జెట్’ పేరుతో పౌర విమాన సర్వీసులు నడుపుతున్నాడు. ఈ కంపెనీ మూడు భారతీయ నగరాల నుంచి పన్నెండు గమ్యాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నది. దీనికంటే ముందు ఒక పోలో క్లబ్ని కూడా రామ్ చరణ్ కొనుగోలు చేశాడు. దానికి
‘రామ్చరణ్ తేజ పోలో అండ్ రైడింగ్ క్లబ్’గా పేరు మార్చాడు.
నటి కాజల్ అగర్వాల్ చెల్లె నిషా అగర్వాల్ కూడా నటే. ఈ అక్కాచెల్లెళ్లు కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మార్సలా (Marsala) బ్రాండ్ పేరు మీద ఆభరణాలను ఆన్
లైన్లో అమ్ముతున్నారు. స్వర్ణ, వజ్రాభరణాలు తమ ప్రత్యేకత అని చెబుతున్నారు.
“ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..”
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
రష్మిక వదిలేసుకున్న సినిమాలేంటో తెలుసా?