తెలుగు సినీతెర చంద్రమోహనం
సంకలన కర్తలు: డా॥ తెన్నేటి సుధాదేవి, జ్యోతి వలబోజు
పేజీలు: 424, వెల: రూ.500
ప్రతులకు: నవోదయ బుక్హౌజ్
books.acchamgatelugu.com
ఈ-బుక్ ఆన్లైన్: kinige.com
తెలుగు వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన నటుడు చంద్రమోహన్. కథానాయకుడిగా, సహనటుడిగా, కమెడియన్గా ఆయన పోషించని పాత్ర లేదు. ఆయన పండించని రసం లేదు. ‘మరికాస్త ఎత్తు ఉండి ఉంటే మమ్మల్ని కొట్టేసేవాడు’ అని అగ్ర కథానాయకులతో మెప్పు పొందిన సొగసరి నటుడు ఆయన. మొదటి సినిమా చంద్రమోహన్తో చేస్తే స్టార్డమ్ వచ్చేసినట్టే అని నమ్మేవాళ్లు హీరోయిన్లు. ప్రేక్షకులను థియేటర్కు రప్పించే స్టార్గా ఆయన్ను చూసేవాళ్లు పెద్ద దర్శకులు.
‘రంగుల రాట్నం’ సినిమాతో మొదలైన చంద్రమోహన్ సినీ ప్రస్థానం పదిలంగా అల్లుకున్న పొదరిల్లు లాంటిది. వందల సినిమాల్లో నటించినా, వేలాది డైలాగులతో మెప్పించినా.. మిమిక్రీ ఆర్టిస్టులు ఆయన మాటకట్టును పట్టుకోలేకపోయారు. హావభావాలను అనుకరించే ప్రయత్నమూ చేయలేదు. అలాంటి విభిన్నమైన నటుడు చంద్రమోహన్. ఆయన సినీ జీవిత విశేషాలను ‘తెలుగు సినీతార చంద్రమోహనం’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చింది వంశీ ఆర్ట్ థియేటర్స్. చంద్రమోహన్ వ్యక్తిగత అనుభవాలు, ఆయన గురించి పలువురు ప్రముఖులు పంచుకున్న ముచ్చట్లను ఈ సంకలనంలో పొందుపరిచారు.
అంతేకాదు చంద్రమోహన్ నటించిన 100 సినిమాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, రచయితలు, వివిధ రంగాల్లోని ప్రముఖులు రాసిన విశ్లేషణా వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఈ వ్యాసాలు చదువుతుంటే, ఆయా సినిమాలు మళ్లీ చూడాలనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సంకలనం చంద్రమోహన్ వికీపీడియాగా అభివర్ణించవచ్చు. ఇప్పటికీ ఆయన తెలుగు తెరపై అప్పుడప్పుడూ కనిపిస్తున్నా.. తనను తాను మరొక్కసారి నిరూపించుకోదగిన పాత్రలు మాత్రం రావడం లేదు. దర్శక నిర్మాతల పరభాషా మోజు ఓ కారణం కావచ్చు.
కణ్వస
పాలబువ్వలో జీడి పప్పులు
ఎగిరే కప్పలు.. నడిచే పాములు
రచన: కంతేటి చంద్రప్రతాప్
పేజీలు: 85, వెల: రూ.150
ప్రతులకు: 8008143507
మీ పిల్లలకు ఓ మంచి పుస్తకం కానుకగా ఇవ్వదలిచారా? అయితే దానికి సమాధానం ‘ఎగిరే కప్పలు నడిచే పాములు’. ఇందులోని 28 కథలూ పిల్లలను ఆకర్షించేవే. చివరి వరకూ చదివింపజేసేవే. ప్రజాదరణ పొందిన పత్రికల్లో ప్రచురితమైన కథలను గుదిగుచ్చి అందంగా తీర్చిదిద్దారు. ప్రతి బొమ్మకూ చక్కటి బొమ్మలు ఉండటంతో పిల్లలను మరింత ఆకట్టుకుంటాయి అనడంలో సందేహం లేదు. అనేక కథలు జంతువులు, పక్షులు పాత్రధారులుగా ఉండటంతో చందమామ కథలను గుర్తుకుతెస్తాయి. పైగా ఇందులోని సరళమైన భాష పుస్తక పఠనానికి దూరమవుతున్న ఈ తరానికి మళ్లీ కథలపై ఆసక్తిని కలిగిస్తుంది. ‘భరిణె రహస్యం’, ‘ముస్తాబు తెచ్చిన ముప్పు’ లాంటివి జానపద కథలతో పోటీ పడతాయి. ‘ఎలుక పిల్ల పెళ్ళి’, ‘చైనా పులి’ లాంటి సరదా కథలు పిల్లల్ని గిలిగింతలు పెడతాయి. ‘పంట దోపిడీ’, ‘మోసానికి మోసం’ కథలు మానవ సంబంధాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి. ‘కోతుల సాయం’, ‘పాప ఉపాయం’ కథలు పేదరాశి పెద్దమ్మ కథలను గుర్తుకు తెస్తాయి. ఈ పుస్తకంలోని కథలు బాలసాహిత్యం అనే పాల బువ్వలో జీడిపప్పుల్లా ఎంతో రుచిగా ఉన్నాయి. పిల్లలున్న ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకమిది.
-ఆర్.సి. కృష్ణస్వామి రాజు
బుక్ షెల్ఫ్
పారిజాతావతరణము
రచన: అనుమాండ్ల భూమయ్య
పేజీలు: 100
వెల: రూ. 100
ప్రతులకు: నవోదయ,విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు
శ్రీ శివరామ
బ్రహ్మేంద్రస్వామి చరిత్ర
రచన: డా. కపిలవాయి లింగమూర్తి
పేజీలు: 165
వెల: రూ. 200
ప్రతులకు:
ఫోన్: 87907 27772
హేతువాదం
రచన: జె.వి.కృష్ణయ్య
పేజీలు: 313
వెల: రూ. 200
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
ఫోన్: 94405 52830
శ్రీభాగవత మాహాత్మ్యము
రచన: మదునూరి సూర్యనారాయణ శర్మ
పేజీలు: 38
వెల: రూ. 50
ప్రతులకు:
ఫోన్: 94407 26851
-జీవితం అంటే ఏమిటి? (తాత్విక గ్రంథం)
రచన: కాలువ మల్లయ్య పేజీలు: 79
వెల: రూ. 80
ప్రతులకు:ఫోన్: 91829 18567